టాలీవుడ్ డ్రగ్స్ కేసు..డిజిటల్ డేటా ఇవ్వడం లేదంటూ పిటిషన్ దాఖలు చేసిన ఈడీ!

గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు ఎంత కలకలం రేపిందో చూసాం. ఇక తాజాగా ఈ కేసులో మరో కోణం ఎదురయ్యింది. కేసుకు సంబంధించిన డిజిటల్ డేటా ఇవ్వడం లేదని సీ ఎస్ సోమేష్ కుమార్, ఆబ్కారీ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాకుండా వీరిని శిక్షించడం తో పాటు డేటా అందేలా చేయాలని తెలిపింది.

ఈ నెల 13న వీరిరువురికీ న్యాయవాది నుండి నోటీసులు పంపించినట్టు కూడా తెలిసింది. ఇక దీనిపై త్వరలోనే విచారణ జరగనుండగా.. గత ఫిబ్రవరి 2న ఈడీ కోరిన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వివరాలు లేకపోవటంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని ఈడీ పేర్కొంది. ఇక వీరిపై ఎలాగైనా కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.