Mokshada Ekadashi: నేడే మోక్ష ఏకాదశి.. విష్ణుమూర్తిని ఇలా పూజిస్తే.. సకల పాపాలు తొలగిపోతాయి?

Mokshada Ekadashi: మన హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసం తర్వాత వచ్చే మార్గశిర శుక్ల ఏకాదశి మోక్ష ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు ఏకాదశి వ్రతం చేయటం వల్ల ప్రతి ఒక్కరికి వారి చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఏకాదశిని మోక్ష ఏకాదశి అని పిలుస్తారు.ఈ మోక్ష ఏకాదశి వ్రతాన్ని 24 గంటల పాటు ఎంతో నిష్టగా భక్తిశ్రద్ధలతో పాటించడం వల్ల చేసిన సకల పాపాలు తొలగి మోక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి ఈ మోక్ష ఏకాదశి వ్రతం రోజు విష్ణుమూర్తిని ఏ విధంగా పూజించాలి అనే విషయానికి వస్తే….

మోక్ష ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. కఠిన ఉపవాసంతో స్వామి వారి వ్రతం ఆచరించవలసి ఉంటుంది. అలాగే స్నానానంతరం పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ఫోటోకి పంచామృతాలతో అభిషేకం నిర్వహించాలి. అదేవిధంగాస్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసిన అనంతరం పాయసం నైవేద్యంగా సమర్పించి పూజ చేయాలి. పూజ అనంతరం విష్ణు సహస్రనామాలను, భగవద్గీత, ముకుందష్టకం చదవటం వల్ల మనం చేసిన పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుంది కనుక ఏకాదశినే మోక్ష ఏకాదశి అని పిలుస్తారు.

ఇలా ఉదయం సాయంత్రం పూజ చేసిన అనంతరం ఉపవాసంతో జాగరణ చేయాల్సి ఉంటుంది. కేవలం పండ్లు పాలు మాత్రమే తీసుకొని స్వామివారి సేవలో ఉండాలి. పొరపాటున కూడా నేడు పప్పుధాన్యాలు, బియ్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండి విష్ణు సహస్రనామాలు పఠిస్తూ జాగరణ చేయాలి అనంతరం మరుసటి రోజు ఉదయం శుభ్రంగా స్నానం చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించిన అనంతరం ఉపవాసాన్ని వదిలి ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి. ఇలా చేయడం వల్ల ఎల్లవేళలా లక్ష్మి విష్ణుమూర్తి అనుగ్రహం మనపై ఉంటుంది.