ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేస్తానంటూ ఈ-మెయిల్ రావడం కలకలం రేపుతుంది. 20కిలోల ఆర్డీఎక్స్ తన వద్ద ఉందంటూ ఈ-మెయిల్లో ఆగంతకుడు పేర్కొన్నాడు. కోట్లాదిమంది ప్రజలను హత్య చేసేందుకు పథకం రచించినట్లుగా తెలిపాడు. దాదాపు 20ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ వేసినట్లు వివరించాడు. ఆర్డీఎక్స్ బాంబులను కొంతమంది ఉగ్రవాదులు తనకు అందించినట్లు తెలిపాడు. ఇప్పటికే పలు నగరాల్లో బాంబులు పెట్టినట్లు ఆగంతకుడు పేర్కొన్నాడు. ప్రధాని మోదీకి బెదిరింపు ఈ-మెయిల్ ఘటనపై దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. బెదిరింపు ఈ-మెయిల్ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టడటంతోపాటు ప్రధాని మోదీ భద్రతను పెంచాయి