ఆ పార్టీలతో ప్రజలకు ఏనాడూ మేలు జరగలేదు: ఎర్రబెల్లి దయాకర్ రావు

తాజాగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని అక్కడ మీడియా సమావేశంలో కొన్ని విషయాలు మాట్లాడాడు. కాంగ్రెస్, బీజేపీలు చెత్త పార్టీలని వాళ్ళ వల్లే పెట్రోలు, డీజిల్, నిత్యవసర ధరలు పెరిగాయని మండిపడ్డారు.

అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు దోపిడీ దొంగల్లా మాట్లాడుతున్నారు అని.. ఆ పార్టీలతో ప్రజలకు ఏనాడూ మేలు జరగలేదని అని.. వాళ్లే లాభపడ్డారు అంటూ.. చేతకాని దద్దమ్మలు అని తీవ్రంగా విమర్శించారు. వీళ్ళ పాలనలో రాష్ట్రం, దేశం సర్వనాశనం అయిందని, గ్రామాల్లో కనీస వసతులు లేని పరిస్థితి తీసుకువచ్చారు అని మండిపడ్డారు.