ఈసారి ఢిల్లీ పర్యటనలో నరేంద్ర మోదీతో భేటీ కానున్న సీఎం జగన్..

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టులో భాగంగా బాగా బిజీగా ఉన్నాడు. ఇటీవలే తమ పారిశ్రామిక పెట్టుబడులకు కోసం దావోస్ పర్యటన కు వెళ్లిన వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ పలువురు ప్రముఖులను భేటీ అయ్యి వారితో తమ రాష్ట్రం గురించి అనేక విషయాలపై చర్చలు చేశారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మళ్లీ ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గురువారం ఢిల్లీకి వెళ్లనున్నట్లు.. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులను కలిసి బేటీ అవనున్నట్లు తెలిసింది. ఇక ఇప్పటికే ప్రధాని మోదీతో చేయాల్సిన చర్చల గురించి షెడ్యూల్ ఖరారు చేస్తున్నట్లు తెలుస్తుంది.