ఇన్సైడ్ టాక్ : “డీజే టిల్లు 2” లో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్..?

ఏదైనా సినిమా హిట్ అయితే అది చిన్నదైనా పెద్దదైనా కూడా దాని ఇంపాక్ట్ తో దాని తర్వాత వచ్చే సినిమాపై మంచి హైప్ డెఫినిట్ గా ఉంటుంది. అలాగే టాలీవుడ్ లో ఈ ఏడాది వచ్చి యూత్ ని ఊపి ఓ సెన్సేషనల్ హిట్ అయ్యిన చిత్రం ”డీజే టిల్లు” కూడా ఒకటి.

యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ అలాగే నేహా శెట్టి లు నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యి పెట్టిన మొత్తం కన్నా మూడింతలు రాబట్టి భారీ లాభాలు కూడా అందించింది. దీనితో ఇప్పుడు దీనికి సీక్వెల్ గా చేస్తున్న సినిమాపై మంచి అంచనాలు సెట్టయ్యాయి.

అయితే లేటెస్ట్ గా సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ క్రేజీ గాసిప్ బయటకి వచ్చింది. సీక్వెల్ పై అంచనాలు పెరగడంతో మేకర్స్ సినిమాని మరింత స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఈసారి ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ పూజా హెగ్డే ని దింపుతున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఈమె హీరోయిన్ గా కనిపిస్తుందా లేక ఏదన్నా కీలక రోల్ లో నటిస్తుందా అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ పూజా హెగ్డే పేరు అయితే ఇపుడు బాగా వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమాని అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఇప్పుడు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.