Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టడానికి కారణం ఏంటి… అందుకే పెట్టారా?

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడి ఘటనలో భాగంగా 27 మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే .ఇలా కులం అడిగిమరీ అక్కడ ఉన్నటువంటి పురుషులపై మాత్రమే ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఈ దాడిలో సుమారు 27 మంది పర్యాటకులు మరణించారు. ఇలా ఉగ్రదాడి ఘటనపై భారత ప్రభుత్వం చాలా సీరియస్ అవ్వడమే కాకుండా తప్పనిసరిగా ప్రతీకార చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించింది.

ఈ ప్రతికార చర్యలలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇలా దాదాపు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తూ ఉగ్రవాదులను మట్టుపెట్టారు. అయితే ఈ ఆపరేషన్ కు సింధూర్ అని పేరు పెట్టారు. ఇలా ఈ పేరు పెట్టడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

ఏప్రిల్ 22వ తేదీ జరిగిన ఈ ఉగ్ర దాడిలో కేవలం పురుషులపై మాత్రమే దాడి చేస్తూ వారిని చంపేయటమే కాకుండా 27 మంది మహిళల సింధూరాన్ని వారికి దూరం చేశారు.. ఇందులో ఆరు రోజుల క్రితం వివాహమైన నవ వధూవరులు వినయ్ నర్వాల్, హిమాన్షి కూడా ఉన్నారు. ఉగ్రవాదుల దాడుల్లో తమ భర్తను కోల్పోయిన మహిళల ప్రతీకారాన్ని తెలియచేసే విధంగా ఆపరేషన్ సింధూర్
అని నామకరణం చేసినట్టు తెలుస్తోంది.

ఇకపోతే మన భారత సంప్రదాయం ప్రకారం ఏదైనా ముఖ్యమైన పనులు చేయడానికి వెళ్లే ముందు వీర తిలకం దిద్దుతాము అందుకోసమే ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలన్న ఉద్దేశంతోనే ఈ ఆపరేషన్ కి సింధూర్ అని నామకరణం చేశారని కూడా తెలుస్తుంది. ఇక ఉగ్రదాడిపై ప్రతీకార చర్యలలో భాగంగా పాక్ ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి చేస్తుంది తప్ప పాక్ ప్రజలపై మాత్రం దాడులు చేయలేదు అంటూ భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది.