Prabhas: ప్రభాస్‌తో సినిమా తీసే ముందు కాస్త ఆలోచించుకొని చేయండి..: వేణు స్వామి సెన్సేషన్‌ కామెంట్స్!

Prabhas: మామూలుగా ఉగాది అనగానే గుర్తొచ్చేది మొదట ఉగాది పచ్చడి, ఆ తర్వాత పంచాంగం. చాలా మంది తమ ఫ్యూచర్ ఎలా ఉందో తెలుసుకోవడానికి రాశి ఫలాలను ఏదో ఒక టైంలో చెక్ చేస్తూనే ఉంటారు. అదీ ఈ ఉగాది రోజు మాత్రం మరీ ఎక్కువ. పంచాంగ శ్రవణం జరగనిదే పండగ కానట్టుగా ఫీలవుతారు. ఇక మన గురించి మనం తెలుసుకోవడంతో పాటు, రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు, సెలబ్రెటీలు వంటి వారి జాతకం కూడా ఎలా ఉండబోతుందన్న విషయాలపైనా చాలా మంది ఆసక్తి ఉండడం సహజమే. అందులో భాగంగానే చాలా మంది జోతిష్కులు తమకు తెలిసిన, తోచిన విధంగా పాపులార్ అవుతూ ఉంటారు. అలా సెలబ్రెటీల గురించి చెప్పి, ఇప్పటికే పాపులర్ అయిన జ్యోతిష్కుడు వేణు స్వామి.

ఆ మధ్య కాలంలో అక్కినేని నాగచైతన్య, సమంతలు కూడా విడిపోతారని చెప్పి, వాళ్ల విడాకుల సమయంలో తాను ముందే చెప్పానంటూ ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకొని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ మరోసారి వైరల్‌గా మారాడు వేణు స్వామి. ప్రభాస్‌తో సినిమాలు తీయాలనుకువారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేయాలని ఆయన హెచ్చరించారు. ఆయనతో సినిమాలు చేస్తే నిర్మాతలు నష్టాలను చవి చూడాల్సి వస్తుందని వేణు స్వామి చెప్పారు. అంతే కాకుండా ప్రభాస్‌తో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించవద్దని ఆయన మరోసారి చెప్పకనే చెప్పాలి.

ఇటీవలి కాలంలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా గురించి తెలిసిందే. ఎంతో వెయిటింగ్ తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కానీ అనుకున్నంత స్థాయిలో విజయాన్ని మాత్రం సొంతం చేసుకోకపోవడంతో ప్రేక్షకులు కాస్త నిరాశ చెందారు. ఈ సమయంలోనే వేణు స్వామి ఇలాంటి కామెంట్స్ చేయడం సెన్సేషన్‌గా మారింది. ఆ మాటలు ఎవరూ పట్టించుకోరని ఆయన అభిమానులు, వేణు స్వామిపై విరుచుకుపడుతున్నారు. ఆయన చెప్పిన విషయాలను ఎవరూ నమ్మరాదని, అసలు ఆయన చెప్పిన జాతకాలు నిజం కాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.