నా వెనుక పెద్ద కుట్ర జరుగుతోంది.. ప్రెస్ మీట్ లో సంచలన విషయాలు బయటపెట్టిన కరాటే కళ్యాణి..!

వివాదాస్పద నటి కరాటే కళ్యాణి ప్రస్తుతం మరొక వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి, కరాటే కళ్యాణికి మధ్య జరిగిన గొడవ కారణంగా ఈవిడ మళ్లీ వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం కరాటే కళ్యాణి పెంచుకున్న పాప గురించి చర్చ జరుగుతోంది. ఇటీవల కళ్యాణి అక్రమంగా పాపను దత్తత తీసుకుంది అని పోలీసులకు ఫిర్యాదు రావడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో కరాటే కళ్యాణి ఇంట్లో లేకపోవడంతో ఆమె తల్లి సోదరుడిని అధికారులు విచారించారు. ఈ సందర్భంగా కరాటే కళ్యాణి తల్లి మాట్లాడుతూ.. చట్టప్రకారం గానే తమ కూతురు పాపను దత్తత తీసుకుందని వాటికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయని అధికారులకు వెల్లడించారు.

ఈ విషయం గురించి ఇటీవల కళ్యాణి ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఈ ప్రెస్ మీట్ లో కరాటే కళ్యాణి సహా ఓ చిన్నారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారి తండ్రి మాట్లాడుతూ సమయం నుండి ఆర్థిక ఇబ్బందుల కారణంగా తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో చిన్న కూతురు కరాటే కళ్యాణి గారికి దత్తత ఇచ్చినట్లు వెల్లడించారు. కళ్యాణి మాట్లాడుతూ.. నేను ఇంటి నుండి పారిపోయానని నా గురించి తప్పుడు ప్రచారం జరుగుతోంది. నేను ఎక్కడికి పారిపోలేదు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ కు వెళ్లాలని ఆవిడ క్లారిటీ ఇచ్చింది.

అంతేకాకుండా కొందరు వ్యక్తులు కావాలనే తన వెనుక కుట్ర చేస్తున్నారని, ఇందులో రాజకీయ నాయకుల హస్తం ఉంది అని ఆవిడ వెల్లడించారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు ఒకవేళ నేను తప్పు చేశానని రుజువులు లు ఉంటే సంతోషంగా స్వీకరిస్తాను. పిల్లల్ని దత్తత తీసుకొని అమ్ముతున్నా అని నా గురించి తప్పుగా ప్రచారం చేస్తు..కొందరు యూట్యూబ్ లో ఇష్టం వచ్చినట్టు థంబ్ నైల్స్ పెడుతున్నారు అంటూ కళ్యాణి ఆగ్రహాం వ్యక్తం చేసింది. అంతే కాకుండ నేనూ తప్పు చేయనంత వరకూ తలదించుకుని ఉండను, నేను ఎవరికో భయపడి పారిపోయే రకం కాదు.. పరుగెత్తించి కొట్టే రకం అంటూ చెప్పుకొచ్చారు.