ఇండస్ట్రీలో శత్రువులు ఎక్కువగా ఉన్నారు.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్!

దక్షిణాది సిని ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిత్యామీనన్ కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లు,పలు కార్యక్రమాలకు న్యాయ నిర్ణీతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా నిత్యమీనన్ గురించి గత కొద్ది రోజులుగా ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈమె త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడమే కాకుండా తనని ఓ వ్యక్తి వేధిస్తున్నాడంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యామీనన్ తన గురించి వచ్చినటువంటి ఈ వార్తలకు పూర్తిగా తప్పు పట్టారు. ప్రస్తుతం ఈమె కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన తిరుచిత్రంబలం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తన గురించి వస్తున్నటువంటి వార్తలకు పూర్తిగా ఖండించారు. తనకు ఇండస్ట్రీలో శత్రువులు ఎక్కువగా ఉన్నారని అందుకే తన గురించి ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇండస్ట్రీలో మన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎంతో మంది శత్రువులుగా మారుతారు ఎప్పుడైతే మనం వారి మాట వినమో అలాంటి సమయంలో ఇలాంటి వదంతులను సృష్టిస్తూ ఉంటారు.ఇలా ఇండస్ట్రీలో తనకు ఎక్కువగా శత్రువులు ఉన్నారని తన శత్రువులే తన గురించి ఇలాంటి వదంతులు పుట్టించారంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తాను ఎంతోమంది దర్శకుల దగ్గర పని చేశానని ఎక్కడా కూడా తనపై ఎలాంటి అభియోగం లేదని ఈ సందర్భంగా నిత్యామీనన్ తన గురించి వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని కొట్టి పారేశారు.