అప్పుడు నాకు సెన్స్ లేదు.. ఇప్పుడు నాన్న లేరు.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్?

మెగాబ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈయన సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా కొనసాగారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పలు కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న నాగబాబు మరోవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే నాగబాబు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు.ఇకపోతే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేశారు.

నాగబాబు తండ్రి వెంకట్ రావు జయంతి కావడంతో ఆయన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన తండ్రిని తలచుకుని ఎమోషనల్ అయ్యారు. నాగబాబు తండ్రి వెంకట్రావు కానిస్టేబుల్ గా పని చేసేవారు. ఈయన 2007 వ సంవత్సరంలో గుండె సంబంధిత వ్యాధితో మరణించారు. ఈ క్రమంలోనే ఆయన జయంతి కావడంతో నాగబాబు తన తండ్రిని తలచుకొని శుభాకాంక్షలు తెలుపుతూ నాన్న మీరు బ్రతికి ఉన్నప్పుడు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనే సెన్స్ నాకు లేదు. ఇప్పుడు మీకు శుభాకాంక్షలు చెప్పాలి అన్న మీరు లేరు అంటూ ఎమోషనల్ అయ్యారు.

అలాగే నెటిజన్లకు సైతం మీ ఆత్మీయులు బ్రతికి ఉన్నప్పుడే మీ ఎమోషన్స్ వారితో పంచుకోండి అంటూ ఈ సందర్భంగా రాసుకొచ్చారు. ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే నాగబాబు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ వ్యవహారాలను చూసుకుంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించిన నాగబాబు పవన్ కళ్యాణ్ కు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు.