Balakrishna – Chiranjeevi: బాలకృష్ణ షోకి చిరంజీవి రాకపోవడానికి అసలు కారణం అదే.?

Balakrishna – Chiranjeevi: టాలీవుడ్ హీరో బాలకృష్ణ ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటివరకు వెండితెరపై నటనతో, డాన్సులతో మెప్పించిన బాలకృష్ణ.. మొదటిసారిగా బుల్లితెరపై షోకి హోస్ట్ గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాడు. ఈ షో ద్వారా బాలకృష్ణ తన లో ఉన్న మరొక యాంగిల్ ని భయపెడుతున్నాడు. ఇప్పటికే ఈ షోకి వచ్చిన మోహన్ బాబు, రాజమౌళి, గోపీచంద్ మలినేని, సుకుమార్, రవితేజ లాంటి ప్రముఖులు ఈ షో కి హాజరై వారికి సంబంధించిన ఎన్నో విషయాలను బాలయ్య బాబు తో పంచుకున్నారు.

కానీ ఈ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మాత్రం హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే చిరంజీవికి, బాలకృష్ణకు మధ్య విభేదాలు ఉన్నాయని పలు సందర్భాలలో వార్తలు కూడా జోరుగా వినిపించాయి. అయితే ఇద్దరు స్టార్ హీరోలకు వృత్తి పరంగా ఎటువంటి ఎటువంటి విభేదాలు లేవు. అంతేకాకుండా అప్పట్లో చిరంజీవి బాలకృష్ణ నటించిన సినిమాలు థియేటర్లలో పోటాపోటీగా విడుదలయ్యేవి. ఈ నేపథ్యంలోనే కొన్ని సార్లు చిరంజీవి పైచేయి సాధిస్తే, మరికొన్నిసార్లు బాలకృష్ణ పైచేయి సాధించేవారు. ఇటీవలె చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి చిరంజీవి హాజరు కాకపోవడానికి గల కారణాలను బీవీఎస్ రవి అనే వ్యక్తి వెల్లడించారు. చిరంజీవి ఈ షోకి రావడానికి ఆసక్తి చూపించారని, కాకపోతే అతని డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో షోకి హాజరు కాలేకపోయారు అని తెలిపారు. ఇక పోతే రెండో సీజన్ తొలి ఎపిసోడ్ బాలకృష్ణ, చిరంజీవి దే అయ్యే చాన్స్ ఉంది అని, అందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని రవి వెల్లడించారు. అను స్టాపబుల్ సీజన్ 2 కి చిరంజీవి తప్పకుండా వస్తారని బి.వి.ఎస్.రవి చెప్పుకొచ్చారు.