Anchor Sreemukhi: పెళ్లి కాలేదని శ్రీముఖిని ప్రేమించి మోసం చేసిన వ్యక్తి ఎవరు.. ఇంత దారుణమా?

Anchor Sreemukhi: తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పటాస్ కార్యక్రమం ద్వారా యాంకర్ రవితో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇలా ఈ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి అనంతరం ఎన్నో కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈమెకు ఉన్న ఈ పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని దక్కించుకున్న శ్రీముఖి ఎంత గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం వెండితెరపై కూడా అవకాశాలను అందుకుంటుంది.

ఇలా బుల్లితెర వెండితెర పై ఎంతో బిజీగా గడుపుతూ ఉన్నటువంటి బుల్లితెర రాములమ్మ నిజ జీవితంలో ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నానని అయితే తాను రిలేషన్ లో ఉన్నవారు అందరూ కూడా మంచి వారు కాదంటూ ఒకానొక సందర్భంలో తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ తన ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నానని అయితే అప్పటికే అతనికి పెళ్లి అయినా కూడా తనతో ఎంతో క్లోజ్ గా ఉంటూ తనని దారుణంగా మోసం చేశాడని తెలిపింది.

ఇక అలా ఆ వ్యక్తి మోసం చేయడంతో కొన్ని రోజులపాటు ఎంతో బాధ పడిన ఆ తర్వాత మరి ఎవరితో రిలేషన్ లో లేననే విషయాన్ని వెల్లడించింది. కెరియర్ మొదట్లో తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని షూటింగ్ సమయంలో ఎక్కువ రోజులపాటు నిలబడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆ సమయంలో ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా అని బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా శ్రీముఖి తెలిపారు.ఇక తాజాగా ఈమె క్రేజీ అంకుల్స్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.