Dhee Show: ఢీ షో లో సందడి చేయనున్న కొత్త యాంకర్… ఢీ రేటింగ్స్ పరిస్థితేంటి?

Dhee Show: బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఎన్నో రియాలిటీ షోలు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ రియాలిటీ డాన్స్ షో కూడా ఎన్నో ఏళ్లుగా బుల్లితెర మీద ప్రసారం అవుతూ.. ఎంతోమందిని కొరియోగ్రాఫర్లుగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఈ డాన్స్ షో మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ డాన్స్ షో ఒకప్పుడు టాప్ రేటింగ్స్ తో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. కానీ ప్రస్తుతం ఈ షో పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది. గతంలో ఈ షో లో ఉన్న జడ్జెస్ తో పాటు మెంటర్స్ అందరూ కూడా మారిపోయారు. శేఖర్ మాస్టర్ స్థానంలో జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ జడ్జి లుగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఈ షో రేటింగ్స్ పడిపోవటానికి ముఖ్యకారణం సుధీర్, రష్మీ ఈ షో నుండి వెళ్లిపోవటం. ఢీ షో లో కంటెస్టెంట్ ల డాన్స్ పర్ఫార్మెన్స్ లతో పాటు .. సుధీర్ , రష్మి టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ కి కూడా ప్రేక్షకులు బాగా అలవాటు పడ్డారు. మొదట సుధీర్ ఈ షో నుండి వెళ్లిపోగా ఆ స్థానంలోకి ఆది వచ్చాడు. తర్వాత రష్మి కూడా ఈ షో కి దూరం అయ్యింది. ఇప్పుడు ప్రదీప్, ఆది మాత్రమే ఢీ షో ని తమ పంచ్ లతో నెట్టుకొస్తున్నారు. ఇక ఆది కూడా ఢీ షో కి దూరం కానున్నాడు. ఇప్పటికే మల్లెమాల వారితో కుదుర్చుకున్న అగ్రిమెంట్ గడువు పూర్తి అవడంతో ఆది కూడా ఈ షో కి దూరమవుతున్నాడు అంటు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఇటీవల ఈ షోకి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఢీ నెక్స్ట్ సీజన్ లో ప్రదీప్ స్ధానంలో కొత్త యాంకర్ కనిపించనున్నట్లు సమాచారం. సుధీర్, రష్మి వెళ్లిపోవడంతో ఢీ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. ఆది కూడా ఢీ లో కొంత కాలమే ఉంటున్నాడు. ఇక ప్రదీప్ కూడా ఈ షో నుండి వెళ్ళిపోతే ఢీ షో పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. ఇప్పటికే జబర్దస్త్ రేటింగ్స్ కూడా భారీగా పడిపోయాయి. ఇక జబర్దస్త్ బాటలోనే ఢీ షో పరిస్థితి కూడా మారనుంది. ప్రదీప్ కూడా లేకపోతే ఈ షో ఇక మూసుకోక తప్పదేమో.