Newly Married Couple: భార్యతో కలిసి అత్తారింటికి వెళ్ళిన నవ వరుడు.. అటునుంచి అనంత లోకాలకు!

Newly Married Couple: ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు అధికమవుతున్నాయి. ఈ క్రమంలోనే వివాహేతర సంబంధాల కారణంగా ఎంతో సంతోషంగా సాగిపోవలసిన వైవాహిక జీవితం కటకటాల పాలు అవుతుంది.పరాయి స్త్రీలతో లేదా పరాయి పురుషులతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఇంట్లో తెలియడంతో హత్యలు చేయడం లేదా వారి బంధానికి అడ్డుగా ఉన్నారని హత్య చేయించడం జరుగుతుంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి బీహార్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

జమూయి జిల్లాలోని చంద్రదీప్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సంపో గ్రామానికి చెందిన వికాస్ కుమార్ అనే యువకుడు కాజల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందే కాజల్ వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగించింది. పెళ్లయిన తర్వాత తన ప్రియుడితో తన సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి తనను చంపాలని పక్క ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలోనే తన భర్తను తీసుకొని పుట్టింటికి వెళ్ళిన కాజల్ వెంటనే తనని చూడటానికి తన స్నేహితులు వచ్చారు. ఆ వచ్చిన వ్యక్తులలో కాజల్ ప్రియుడు కూడా ఉన్నారు.అలా కాజల్ ఇంటికి వచ్చి వారు చంపాలనుకున్న వ్యక్తిని చూసి వారి పథకానికి ప్రణాళిక వేశారు.

ఈ క్రమంలోనే వికాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లగానే ముందు ప్లాన్ ప్రకారం కాజల్ ప్రియుడు అతని సహచరులు వికాస్ ను గొంతు కోసి చంపారు. అయితే వికాస్ కనిపించకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో ఊరి చివర అతని మృతదేహం కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తనని హత్య చేసినట్లు భావించారు.ఇక తన భార్య కాజల్ పై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.