హీరోయిన్ పూజా హెగ్డే ను భయపెట్టిన ఆ ఘటన..

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ వరస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా తనకు ఒక చేదు అనుభవం ఎదురయింది.

ఆ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ముంబై నుంచి వస్తున్న ఇండిగో విమానం లో విపుల్ నకాషే అనే వ్యక్తి తనతో మొరటుగా ప్రవర్తించరాడు అని.. ఎటువంటి కారణం లేకుండానే తమతో పూర్తిగా అహంకారం, అజ్ఞానంతో బెదిరించి మాట్లాడాడు అని.. సాధారణంగా ఇటువంటి సమస్యల గురించి తను ట్వీట్ చేయను అంటూ.. కానీ ఈ సంఘటన మాత్రం తనను భయపెట్టింది అని తెలిపింది.