Rajashekar: ధ్రువ సినిమాలో ఆ పాత్రలో నటించకపోవడానికి అసలు కారణం అదే.. రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్!

Rajashekar: టాలీవుడ్ హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో కుటుంబ చిత్రాలలో యాక్షన్ చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజశేఖర్ ఇప్పటికీ పలు చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజశేఖర్ శేఖర్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఇదిలా ఉండగా తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న రాజశేఖర్ దంపతులు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

వారిద్దరూ మొదటగా కలుసుకున్న విషయాలను ఈ కార్యక్రమంలో రాజశేఖర్ దంపతులు తెలిపారు. అదే విధంగా తను కోవిడ్ బారిన పడినప్పుడు జీవిత, పిల్లలను ధైర్యంగా ఉండాలని చెప్పానని తనకైతే బతుకుతానని ఆశలు కూడా లేవని, ఈ సందర్భంగా రాజశేఖర్ ఆ విషయాలను తలుచుకుని ఎమోషన్ అయ్యారు. కేవలం ప్రేక్షకుల ప్రార్థనల వల్లే నేను ఇలా ఉన్నాను అంటూ తెలిపారు. అదేవిధంగా జీవిత ఈ కార్యక్రమం ద్వారా మాట్లాడుతూ ధ్రువ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.

ఈ సందర్భంగా ధ్రువ సినిమాలో విలన్ పాత్రలో అరవిందస్వామి ఎంతో అద్భుతంగా నటించారు. నిజానికి ఆ పాత్రలో రాజశేఖర్ కి ఇస్తే బాగుంటుందని డైరెక్టర్ సురేందర్ రెడ్డిని అడిగితే అతను లేదని చెప్పారు. దీంతో ఆ సినిమా నుంచి రాజశేఖర్ తప్పుకోవాల్సి వచ్చిందని జీవిత తెలిపారు. మంచి ప్రాధాన్యత ఉన్న విలన్ పాత్రలో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని ఈ సందర్భంగా రాజశేఖర్ తెలిపారు.