Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ లిరిసిస్ట్ స్పెషల్ షో..!

Telugu Indian Idol: ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఆహా లో మొదలైన తెలుగు ఇండియన్ ఐడల్ ఎంతోమంది సింగింగ్ టాలెంట్ ఉన్న యువతీ, యువకులకు మంచి అవకాశాలు కల్పించింది. ఆహా ఎన్నో రకాల కొత్త తరహా ప్రోగ్రాం లతో మంచి రేటింగ్ తో అతి తక్కువ కాలంలో లీడింగ్ ఓటిటి సంస్థగా దూసుకుపోతుంది. ఆహా అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది వ్యూయర్స్ ను సంపాదించుకుంది. అన్ స్టాపబుల్ లాంటి కొత్త తరహా ప్రోగ్రామ్లు కూడా చేస్తూ ప్రజలకు మరింత చేరువైంది.

రియాలిటీ షోలు మాత్రమే కాకుండా వెబ్ సీరీస్ లతో పాటు కొత్త సినిమాలను కూడా హై క్వాలిటీ పద్దతిలో ఆహా లో విడుదల చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ కి మంచి టాలెంట్ ఉన్న సింగర్స్ ని అందించటమే లక్ష్యంగా తెలుగు ఇండియన్ ఐడల్ ను కూడా మొదలుపెట్టింది. ఈ సింగింగ్ షో ని ప్రముఖ సింగర్ శ్రీరామ్ చంద్ర హోస్ట్ చేయగా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరోయిన్ నిత్యా మీనన్, సింగర్ కార్తీక్ మెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ సింగింగ్ షో మొదలై ఇప్పటికే 22 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని ప్రస్తుతం 9 మంది కంటెస్టెంట్లు ఈ పోటీలో పాల్గొంటున్నారు. అయితే ఈ వారం జరగబోయే ఎపిసోడ్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ స్పెషల్ ఎపిసోడ్ కి రామజోగయ్య శాస్త్రీ స్పెషల్ గెస్ట్ గా విచ్చేయనున్నారు. అందువల్ల ఈ ఎపిసోడ్ ని లిరిసిస్ట్ స్పెషల్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సింగింగ్ షో కి విచ్చేస్తున్న రామజోగయ్య ఎన్నో సినిమాలకు మంచి పాటలను అందించాడు. ఇండియన్ ఐడల్ లో ప్రస్తుతం ఉన్న 9 మంది సింగర్స్ లో 3 టాలెంటెడ్ సింగర్స్ ను ఫిల్టర్ చేయనున్నారు.