మిస్ ఇండియా వరల్డ్‌గా తెలుగు అమ్మాయి !

తెలంగాణ యువతి మానస వారణాసి వీఎల్‌సీసీ ఫెమినా ‘మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020’ పోటీల్లో విజేతగా నిలిచారు. హర్యానా యువతి మానిక శికంద్‌ ఫెమినా మిస్‌ గ్రాండ్‌ ఇండియా 2020గా, యూపీకి చెందిన మాన్యసింగ్‌ ఫెమినా మిస్‌ ఇండియా 2020 రన్నరప్‌గా నిలిచారు. బుధవారం రాత్రి ముంబైలో ఈ కార్యక్రమం జరిగింది. జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్‌ నటులు నేహా ధూపియా, చిత్రాంగద సింగ్‌, పులకిత్‌ సమ్రాట్‌, ప్రముఖ డిజైనర్‌ ఫల్గుణి వ్యవహరించారు.

సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న మానస చిన్నప్పటి నుండి మోడలింగ్ పై ఆసక్తితో ఈ వైపుకు వచ్చినట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.హరియానా యువతి మానిక శికందర్‌ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020 గా నిలిచింది. ఇక ఉత్తర ప్రదేశ్‌ కు చెందిన మాన్యసింగ్ మిస్ ఇండియా 2020 రన్నరప్ గా నిలిచింది. ఈ అందాల కాంపిటీషన్ జ్యూరీ సభ్యులుగా నేహా ధుపియా, చిత్రాంగధ సింగ్‌, పులకిత్ సామ్రాట్‌ ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ లు వ్యవహరించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల వారు మానస వారణాసి గురించి సోషల్‌ మీడియాలో తెగ వెదికేస్తున్నారు.