ఒక్కొక్కడితో భయం స్పెల్లింగ్ రాయిస్తున్న జగన్

telangana bjp mp arvind deadline to ap cm jagan

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవ్వరు ఊహించని స్థాయికి ఎదిగిన నాయకుల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకరు. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు కేవలం మూడు నెలల ఎంపీ అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏపీ రాజకీయాలను తన కనుచూపుతో కంట్రోల్ చేస్తున్నారు. జగన్ పేరు చెబితే రాష్ట్రంలో ఒక్కొక్కరికి చెమటలు పడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డి పేరు చెప్పినా, వినబడినా కూడా వణికిపోతున్నారు.

jagan cbn telugu rajyam
jagan cbn telugu rajyam

చంద్రబాబు చేసిన తప్పే ఇదంతా

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక శక్తిలా ఎదగడానికి , ఏకంగా టీడీపీని పూర్తిగా భూస్థాపితం చేసి మరీ ఎన్నికల్లో గెలవడానికి కారణం ఒక రకంగా చంద్రబాబు నాయుడే. ఎందుకంటే 2014 ఎన్నికల్లో గెలిచిన బాబు జగన్ ను అసలు నాయకుడిగా కూడా గుర్తించకుండా విచ్చలవిడిగా పాలన కొనసాగించారు. ఇష్టమొచ్చినట్టు అమరావతిలో అక్రమాలకు టీడీపీ నాయకుల పాల్పడ్డారు. కక్ష్యసాధింపు రాజకీయాలతో ప్రజల్లో జగన్ కు సింపథి ఏర్పడేలా చేసింది చంద్రబాబు నాయుడే. ఇలా తాను చేసిన తప్పుతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ చూస్తే వణికిపోతున్నారు.

జగన్ ఢిల్లీ- బాబు గజగజ

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుండి ఢిల్లీ అనే మాట వినబడితే చాలు చంద్రబాబు నాయుడుకు చలి జ్వరం వస్తుంది. ఎందుకంటే ఎక్కడ బీజేపీ కేంద్ర పెద్దలతో మాట్లాడి గతంలో తాను చేసిన తప్పులను బయటకు తీసి తనపై సీబీఐ కేసులు వేస్తారేమోనని భయపడుతున్నారు. జగన్ ఢిల్లీకి వెళ్లినా కుడా రాష్ట్రానికి ఉపయోగం ఉందని బాబు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా లోపల మాత్రం బాబుకు చెప్పలేని భయం. అలాగే బాబుకు తన పార్టీ నాయకులను ఎక్కడ జగన్ లాక్కుంటారేమోననే భయం కూడా ఉంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ లాంటి కీలక నేతలు వైసీపీకి అనుకూలంగా ఉంటూ చంద్రబాబు నాయుడుకు చుక్కలు చూపిస్తున్నారు. వైసీపీ చేస్తున్న కక్ష్య సాదింపు రాజకీయాల వల్ల చాలామంది టీడీపీ నాయకులు వైసీపీ బాటపడుతున్న విషయం తెలిసిందే. ఇలా చిన్న గడ్డిపోచ అనుకున్న జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి, టీడీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు.