లోకేష్ ఆకుకూర‌లుతింటే 16 కూర‌లేంటి?

తేదాపా జాతీయ కార్య‌ద‌ర్శి లోకేష్ తాడిపత్రి వెళ్లి అక్క‌డ 16 ర‌కాల కూర‌ల‌తో మంచిగా బోజ‌నం చేసి వ‌చ్చారంటూ వైకాపా ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి చేసిన ట్వీట్ వైర‌ల్ ఆ మారిన సంగ‌తి తెలిసిందే. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్లి లోకేష్ అక్క‌డ సుష్టిగా భోజ‌నం చేసి టూర్ ని తాడిప‌త్రి టూర్ ని ఎంజాయ్ చేసి వ‌చ్చాడంటూ విజ‌య‌సాయి వ్య‌గ్యంగా స్పందించారు. తాజాగా ఆ ట్వీట్ పై తేదాపా నేత‌లు మండిప‌డ్డారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న విజ‌య‌సాయి ట్వీట్ కు కౌంట‌ర్ వేసారు. లోకేష్ కార్య‌క‌ర్త కోసం ఎంత దూర‌మైనా వెళ్తారు. ఆయ‌న తీరు చూసి వ‌ణ‌కుతున్నావ్ ఏంటి విజ‌య‌సాయి రెడ్డి గారు అన్నారు.

తాడిప‌త్రికి లోకేష్ త‌న‌తో పాటు ఇంటి నుంచి ఆకు కూర‌ల భోజ‌నం తెచ్చుకున్నారు. అదే భోజనం చేసారు. దీన్ని కూడా రాజ‌కీయం చేయాల‌ని చూస్తున్నారు చూడు అది మీ తింగ‌రి మాలోకం. మీతింగ‌రి మాలోకం అవినీతి సొమ్ము బొక్క‌డానికి తండ్రి శ‌వాన్ని తాక‌ట్టు పెట్టి సీఎం అవ్వాలి అనుకున్నారు. ఓదార్పు అంటూ సోకాలు పెట్టారు. పాద‌యాత్ర అంటూ మైన్స్, ల్యాండ్స్, పై క‌న్నేసారు. అవినీతి సొమ్ము మేసి జైలుకైనా పోవ‌డానికి సిద్దం అనే గ‌న్నేరుప‌ప్పు అంటూ ఘాటుగా స్పందించారు. మ‌రి దీనిపై విజ‌య‌సాయి ఎలా స్పందిస్తారో చూద్దాం. మొత్తానికి లోకేష్ భోజనం గోడ‌వ ఈ రోజంతా సోష‌ల్ మీడియాలో హైలైట్ అవ్వ‌డం విశేషం.

అస‌లే ప‌ప్పు అంటూ లోకేష్ పై కామెంట్లు జోరుగా ప‌డుతుంటాయి. తాజాగా బుద్దా అన‌వ‌స‌రంగా కెలికి మ‌రీ ఆకు కూర‌లు తిన్నాడు. అందులోనూ డైట్ ఫాలో అవుతున్నాడు. కొంచెమే తిన్నారు అన్న‌ట్లు వ్యాఖ్యానించ‌డం మ‌రింత చ‌ర్చ‌కు దారి తీయ‌క‌పోతే ప‌ర్వాలేదు. ఆ విష‌యాన్ని విజ‌య‌సాయి లైట్ తీసుకుంటే ప‌ర్వాలేదు. లేదంటే మ‌ళ్లీ క‌థ మొద‌టికే వ‌స్తుంది. అస‌లే సోష‌ల్ మీడియాలో ఆడేసుకునే జ‌నాలు అంతే ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. దొరికిన నాయ‌కుడిని దొరికిన‌ట్లు ట్రోల్ చేసి ఆడుకోవ‌డం నెటి జ‌నుల్లో ఓ ప‌రిపాటిగా మారిపోయింది. పైగా పంచ్ లు వేయ‌డంలో విజ‌య‌సాయి దిట్ట.