పంచతంత్ర కథలోని అద్భుతమైన పాటను విడుదలచేసిన తరుణ్ భాస్కర్..

ఐదు కథల నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమా ‘పంచతంత్ర కథలు’. మధు క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడిగా గంగనమోని శేఖర్ పరిచయమవుతున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాలో ఒక లిరికల్ వీడియో పాటను విడుదల చేశాడు దర్శకుడు తరుణ్ భాస్కర్.

ఇక ఆ పాట ‘నేనేమో మోతెవారి’ అనే లైన్ తో ప్రారంభం అవ్వగా ఈ పాట ప్రస్తుతం నెట్టింట్లో బాగా హల్ చల్ చేస్తుంది. ఇక ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించాడు. రామ్ మిరియాల ఈ పాటను పాడి అందరి దృష్టిలో పడ్డాడు. ఇక తరుణ్ భాస్కర్ మాత్రం ఇది తన ఫేవరెట్ సాంగ్ అని తన మనసులో మాటను బయట పెట్టాడు.