జూనియర్ ఎన్టీఆర్ కోరిక నెరవేర్చిన తమిళ దర్శకుడు అట్లీ.. ఏం చేశారో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొంతకాలం క్రితం వరకు తెలుగు ప్రేక్షకులకు మాత్రమే అభిమాన హీరోగా ఉన్న ఈ స్టార్ హీరో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో అభిమానులను సొంతం చేసుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. పాన్ ఇండియా లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా విడుదలైన ఈ సినిమా అన్ని భాషలలోను ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులకు అభిమాన హీరోగా మారాడు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సాధారణంగా ఎన్టీఆర్ మంచి భోజనప్రియుడు. అందువల్లే ఆయన ఒకానొక సమయంలో అధిక బరువు ఉండేవాడు. కానీ సినిమాల మీద తనకున్న ప్రేమ వల్ల ఎన్టీఆర్ ఎంతో కష్టపడి సన్నబడ్డాడు. సినిమాల కోసం తనకి ఇష్టమైన ఫుడ్ తినటం కూడా తగ్గించాడు. ఈ విషయం గురించి జూనియర్ ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు షో లో స్వయంగా బయటపెట్టాడు. ఎన్టీఆర్ కి చెన్నై స్పెషల్ “తలపాకట్టి బిర్యానీ” ఎంతో ఇష్టమని ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు సునీల్ ఒక సందర్భంలో తెలియచేశాడు.

ఇదిలా ఉండగా ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ, యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి ఓ కథ చెప్పటానికి ఆయనని కలవాలని అనుకున్నారు. ఈ క్రమంలో ఎన్టీయార్‌ తనకి ఇష్టమైన తలపాకట్టి బిర్యానీ తీసుకురావాలని డైరెక్టర్ అట్లీని కోరాడు. దాంతో అట్లీ తలపాకట్టి బిర్యానీని ఆర్డర్ చేశాడట. దీంతో సునీల్ వచ్చి తిని వెళ్ళొచ్చు కదా.. అని అట్లీతో చేప్పగా.. అది తనకోసం కాదని.. జూనియర్ ఎన్టీఆర్ కోసం ఆర్డర్ చేశానని అట్లీ చెప్పాడు. తాజాగా ఈ విషయాన్ని సునీల్ బయటపెట్టాడు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కి హైదరాబాదీ బిర్యాని కన్నా చెన్నై లో లభించే తలపాకట్టి బిర్యాని ఎంతో ఇష్టమని అర్థమవుతోంది.