Surender Reddy – Ram charan: చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తిన సురేందర్ రెడ్డి?

Surender Reddy – Ram charan: టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు రామ్ చరణ్. స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న రామ్ చరణ్ హీరోగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఇలా వివిధ రంగాలలో తన సత్తాను చాటుతూ దూసుకుపోతున్నారు. ఇకపోతే దర్శకుడు సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ధృవ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. చిరంజీవి సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి సినిమాకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించారు.

ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు సురేందర్ రెడ్డి తనకు సైరా నరసింహారెడ్డి షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాల గురించి వెల్లడించారు. సైరా నరసింహారెడ్డి సినిమాలోని కొన్ని సన్నివేశాల షూటింగ్ బల్గేరియాలో జరిగిందని సాధారణంగా సినిమాలకోసం సెట్స్ వేస్తామని, కానీ పని చేసే వాళ్ళ కొరకు సెట్స్ వేశామని సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే అక్కడ గాలి వల్ల షూటింగ్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని ఎడారిలో ఉండే ఆ ప్రాంతంలో ఆర్టిస్టులను టెక్నీషియన్లను ఉంచడం కొరకు రామ్ చరణ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్ ల కోసం బాత్ రూమ్ బెడ్ రూమ్స్ వచ్చేలా ఏర్పాటు చేయాలని సూచించారని, అంతేకాకుండా అందుకోసం రామ్చరణ్ భారీ మొత్తంలో ఖర్చు కూడా చేశారని సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు.

గుర్రాల కోసం 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి మరీ షెడ్డు వేయించారని, స్టార్ హీరో అయిన రామ్ చరణ్ కు మాత్రమే అంత శ్రద్ధ తీసుకోవడం సాధ్యం అవుతుంది అని సురేందర్ రెడ్డి కామెంట్లు చేశారు. వేరే వాళ్ళు అయితే అంత శ్రద్ధ తీసుకోరు అంటూ సురేందర్ రెడ్డి చరణ్ గొప్పతనం గురించి చెబుతూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది.