Sudigali Sudheer: ఢీ షో లో తన రీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన సుడిగాలి సుదీర్..!

Sudigali Sudheer: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన కమెడియన్ లలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు. సుడిగాలి సుధీర్ గురించి ఇండస్ట్రీలో తెలియని వారుండరు అనటంలో సందేహం లేదు. సుధీర్ తన కామెడీ టైమింగ్ తో, పంచులతో కమెడియన్ గా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. సుధీర్ కమెడియన్ గా మాత్రమే కాకుండా పలు టీవీ షోలకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం సుధీర్ ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు.

ఒకవైపు కమెడియన్ గా, మరొకవైపు యాంకర్ గా తన సత్తా చాటుకున్న సుధీర్ నటుడిగా కూడా తన సత్తా నిరూపించుకున్నాడు. ఇప్పటికే సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమాలో హీరోగా నటించిన సుధీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. సుడిగాలి సుధీర్ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతకాలం క్రితం వరకు ఢీ షో లో సందడి చేసిన సుధీర్ ఉన్నట్టుండి ఆ షో మానేయటం తో సుధీర్ అభిమానులు కొంచెం అసంతృప్తి చెందారు. గత కొన్ని రోజులుగా సుదీర్ మళ్లీ ఢీ షో కి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో ఒక అభిమాని ఈ విషయం గురించి మాట్లాడుతూ.. సుధీర్ అన్న మీ షోస్ వీకెండ్ లో వస్తే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. కానీ ఈ మధ్య మీరు ఢీ షో లో ఎందుకు కనిపించడం లేదు అని అడిగాడు. అందుకు సుదీర్ స్పందిస్తూ..” ఢీ షో ని నేనెప్పుడూ మానేశాను? కొంచం గ్యాప్ ఇచ్చనంతే . ఐ విల్ బి బ్యాక్ వెరీ సూన్” అంటూ సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం సుధీర్ అన్న ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మాటలతో సుదీర్ మళ్లీ డీ షో లో సందడి చేయబోతున్నాడు అని అతని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.