విశాఖ ఎల్ పాలిమర్స్ ఘటన తర్వాత అధికార పార్టీ- ప్రతి పక్షం టీడీపీ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటోన్న సంగతి తెలిసిందే. సింహాచలం అప్పన్న స్వామి భూములను చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పనంగా ఎల్ జీ కంపెనీ దారాదత్తం చేసారి అధికార పక్షం ఆరోపించింది. అప్పన్న భూమిలో 128 ఎకరాలకు లెక్క చెప్పే దమ్ము టీడీపీకి ఉందా? అని మంత్రి కురసాల కన్నబాబు ఘాటు విమర్శలు చేసారు. ప్రతీగా టీడీపీ అదే స్థాయిలో ఘటనకు సంబంధించిన విషయాలపై రాజకీయ రంగు పులుమే ప్రయత్నం చేసింది.
పనిలో పనిగా అప్పన్న భూములు మీరు తిన్నారంటూ! ప్రతి దాడికి దిగారు. ఈ నేపథ్యంలో వైకాపా మంత్రి బొత్స సత్యానారాయణ సీన్ లోకి ఎంటర్ అయ్యారు. తెలుగు దేశం పార్టీ ఆన్ లైన్ జూమ్ పార్టీగా మారిపోయిందని మంత్రి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలకు అందుబాటులో ఉండకుండా జూమ్ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ను దోచుకున్న టీడీపీ దొంగలకు మాత్రమే అలాంటి వంకర బుద్దులు ఉంటాయని మండిపడ్డారు.
భూములు కాజేసే అలవాటు తమ పార్టీకి ఎప్పుడూ లేదని..అలాంటి నీచమైన పార్టీనీ తాము ఎప్పుడు నడపలేదని ఎద్దేవా చేసారు. అమరావతి రాజధాని పేరిట వేల ఎకరాలను ఎలా దోచేసారు? చంద్రబాబు బంధువులకు ఎలా దారాధత్తం చేసారా? చేసారా ? అన్నది ప్రభుత్వానికి తెలియదనుకుంటున్నారా? అని ఆరోపించారు. విశాఖలో ఖరీదైన ప్రైమ్ ఏరియాలో మీ రాక్షస ఆగడాలు ఎలా సాగాయో విశాఖ వాసులకు తెలియదా? అని ఆరోపించారు. ఇక మీ ఆటలు చెల్లవు..కాలం చెల్లిందంటూ మండిపడ్డారు.