సుశాంత్ సింగ్ కేసు: చనిపోయేముందు సుశాంత్ సింగ్ అతన్ని కలిశాడా??

subramanian swamy sensational comments on sushant singh rajput case

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్య జరిగిందా? అనేది ఎటూ తేలడం లేదు. చివరకు సీబీఐ కూడా రంగంలోకి దిగింది. సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తోంది. అసలు నిజాలు బయటపడాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.

subramanian swamy sensational comments on sushant singh rajput case
subramanian swamy sensational comments on sushant singh rajput case

ఇక.. మరోవైపు రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సుశాంత్ పై ఆరోపణలు చేశారు. ఇప్పటికే సుబ్రహ్మణ్య స్వామి.. సుశాంత్ పై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

సుశాంత్ మరణించడానికి కొన్ని గంటల ముందే దుబాయ్ కంప్లయింట్ డ్రగ్ డీలర్ అయూష్ ఖాన్.. సుశాంత్ ను కలిశారంటూ స్వామి ఆరోపణలు చేశారు. దానితో పాటుగా సునంద పుష్కర్ కేసుపై కూడా మరో ఆరోపణ చేశారు స్వామి.

సునంద పుష్కర్ పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఆమె కడుపులో దొరికిన వాటితోనే అసలు నిజం ఏంటో తెలిసింది. కానీ.. శ్రీదేవి విషయంలోనూ సుశాంత్ విషయంలోనూ అది జరగలేదు. దానితో పాటుగా సుశాంత్ మరణానికి ముందు డ్రగ్ డీలర్ అయూష్ ఖాన్ సుశాంత్ ను ఎందుకు కలిశాడు.. అనేదానిపై కూడా క్లారిటీ లేదు.. అంటూ సుబ్రహ్మణ్య స్వామి తన ట్వీట్ లో తెలిపారు.

subramanian swamy sensational comments on sushant singh rajput case
subramanian swamy sensational comments on sushant singh rajput case

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి, దుబాయ్ కి మధ్య ఏదో లింక్ ఉంది.. అని సుబ్రహ్మణ్య స్వామి గత వారమే ఆరోపించారు. అంతే కాదు.. సుశాంత్ కేసుతో పాటుగా శ్రీదేవి కేసును.. అలాగే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సెలబ్రిటీల అందరి కేసులను సీబీఐ టేకప్ చేయాలంటూ ఆయన అప్పుడే డిమాండ్ చేశారు.

ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మళ్లీ తాజాగా సుశాంత్.. డ్రగ్ డీలర్ ను కలిశాడంటూ మరో ఆరోపణ చేశారు స్వామి.