తెలుగు సినిమా ఇంత దారుణమా.?

అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా వచ్చిన ‘లవ్ స్టోరీ’ బాగానే ఆడింది. అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో అఖిల్ – పూజా హెగ్దే జంటగా తెరకెక్కిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఏదో అలా మమ అనిపించింది. అయితే, ఈ రెండు సినిమాలూ హిట్ ఖాతాలో వేసేశారు.

కానీ, ప్రేక్షకులు ఎక్కడ.? ధియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయా.? అయ్యాయంటే అయ్యాయనిపించేశారంతే. వాస్తవంలోకి వెళితే, సినిమా వైపు అసలు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగాలంటే, ఒకింత పెద్ద సినిమాలు వస్తే కానీ, పరిస్థతి మారదు. కానీ, ఇప్పట్లో పెద్ద సినిమాలైతే వచ్చేలా కనిపించడం లేదు.

ఈ భయాలు ఇంకెన్నాళ్లో కానీ, తెలుగు సినీ పరిశ్రమలో అలజడి రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయినా కానీ, కొత్త కొత్త సినిమాలు కుప్పలు తెప్పలుగా అనౌన్స్ అవుతున్నాయి. షూటింగులు పూర్తి చేసేసుకుంటున్నాయి. కరోనా భయాలు పూర్తిగా తొలిగిపోయినా, తెలుగు సినిమా కష్టాలు తీరేటట్టు కనిపించడం లేదు.

మరోవైపు రేస్‌లోంచి ఒక్కొక్కటిగా పెద్ద సినిమాలు పక్కకి తప్పుకుంటున్నాయి. దాంతో సంక్రాంతి సీజన్‌తోనైనా తెలుగు సినిమాకి కొత్త కళ వస్తుందని ఆశించిన సగటు సినీ ప్రియులకు ఆ ఆశ కూడా తీరేలా కనిపించడం లేదు.