సుడిగాలి సుదీర్ బుల్లితెర స్టార్ గా ఎంతో క్రేజ్ ఏర్పరచుకున్నారు. ఈయన బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలలో పాల్గొని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు.ఇలా బుల్లితెరపై ఈటీవీలో మల్లెమాల వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో సుడిగాలి సుధీర్ పాల్గొని బుల్లితెరపై స్టార్ గా పేరు సంపాదించుకున్నారు.ఇలాంటి క్రేజ్ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఏకంగా వెండితెర అవకాశాలను కూడా అందుకున్నారు. ఇకపోతే ఈయనకు లైఫ్ ఇచ్చిన మల్లెమాల వారి నుంచి సుధీర్ ప్రస్తుతం తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే మల్లె మాల వారు నిర్వహిస్తున్నటువంటి జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు.అయితే ప్రస్తుతం ఈ మూడు కార్యక్రమాలలో కూడా సుడిగాలి సుధీర్ కనిపించడం లేదు.ఈ క్రమంలోనే మల్లెమాల వారికి సుడిగాలి సుధీర్ కి మధ్య మనస్పర్థలు వచ్చాయని అందుకే సుధీర్ మల్లెమాల వారి నుంచి దూరం అవుతూ స్టార్ మా దగ్గర అవుతున్నారని వార్తలు వచ్చాయి.
ఇలా సుధీర్ ఈటీవీకి దూరమవుతూ స్టార్ మాలో యాంకర్ అనసూయతో కలిసి సూపర్ సింగర్ జూనియర్స్ అనే కార్యక్రమానికి పూర్తి స్థాయి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్ కొత్త షో కి తీసుకొనే రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి. గతంలో సుధీర్ కి ఒక్కో ఎపిసోడ్ కు మల్లెమాల వారు నాలుగు లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చేవారు.ప్రస్తుతం స్టార్ మా లో ఇతనికి ఒక్కో ఎపిసోడ్ కు 6 నుంచి 7 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా మల్లెమాల వారు అధిక రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంతోనే సుధీర్ స్టార్ మాకి వచ్చినట్లు పలువురు భావిస్తున్నారు.
