స్టార్ హీరోయిన్ రాశీఖన్నా తొలి రెమ్యునరేషన్ అంత తక్కువా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ తో కెరీర్ ను కొనసాగిస్తున్న హీరోయిన్లలో రాశీఖన్నా ఒకరనే సంగతి తెలిసిందే. ఊహలు గుసగుసలాడే సినిమాతో రాశీఖన్నా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మనం సినిమాలో రాశీఖన్నా చిన్న పాత్రలో నటించగా ఆ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే. ఆ తర్వాత జోరు, జిల్, బెంగాల్ టైగర్, శివం, సుప్రీమ్ సినిమాలలో రాశీఖన్నా నటించారు.

రాశీఖన్నా నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు యావరేజ్ రిజల్ట్ ను అందుకున్నాయి. రాశీఖన్నా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా జై లవకుశ సినిమాలో నటించగా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. తొలి ప్రేమ, ప్రతిరోజూ పండగే, వెంకీ మామ సినిమాలు రాశీఖన్నా క్రేజ్ ను పెంచాయి. ప్రస్తుతం రాశీ ఖన్నా పక్కా కమర్షియల్ సినిమాలో నటించారు.

జులై 1వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. పక్కా కమర్షియల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాశీఖన్నా మాట్లాడుతూ తన తొలి రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ తన తొలి రెమ్యునరేషన్ 5000 రూపాయలు అని వెల్లడించారు. ఆ మొత్తాన్ని తన తల్లీదండ్రులకు ఇచ్చానని ఆమె వెల్లడించారు. రాశీఖన్నా పక్కా కమర్షియల్ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

రాశీఖన్నా ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోటి రూపాయల లోపు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. రాశీఖన్నా తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాశీఖన్నా కొత్త ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. స్టార్ హీరోల సరసన ఈ హీరోయిన్ కు ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు. ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధిస్తే మాత్రమే ఈ హీరోయిన్ కు కొత్త ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.