తన పెళ్లి గురించి నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పిన శ్రీముఖి…!

బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్లలలో శ్రీముఖి కూడా ఒకరు. బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి ఎన్ని షోలకు యాంకర్ గా వ్యవహరించింది. తన అందంతో , యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అదుర్స్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీముఖి ఎన్నో టీవీ షో లకి యాంకర్ గా వ్యవహరించింది. యాంకర్ గా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలు పోషించి ఒక మంచి నటిగా కూడా గుర్తింపును సంపాదించుకుంది.

ప్రస్తుతం బుల్లితెర మీద యాంకర్ గా చలామణి అవుతున్న వాళ్లలో రష్మి, శ్రీముఖి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పవచ్చు. అప్పుడప్పుడు వీరి పెళ్ళి గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన ఫోటోలు, వీడియోలు మాత్రమే కాకుండా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ వారు అడిగే ప్రశ్నలకు కూడా శ్రీముఖి సమాధానాలు ఇస్తుంది.

ఇలా సోషల్ మీడియా ద్వారా నెటిజెన్స్ ఒక్కోసారి శ్రీముఖి ఇబ్బంది పెట్టే విషయాల గురించి కూడా ప్రస్తావిస్తూ వుంటారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా శ్రీముఖి పెళ్లికి సంబంధించిన విషయం గురించి ప్రస్తావించగా.. శ్రీముఖి సమాధానం ఇస్తూ “ఏమో సర్ నాకు ఇంట్రెస్ట్ పోయింది” అంటు జవాబిచ్చింది. ఇలా ప్రతిసారీ తన పెళ్లి గురించి అడగటంతో శ్రీముఖి ఇలా ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చింది. ప్రస్తుతం పెళ్లి గురించి శ్రీముఖి చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీముఖి పెళ్లి కోసం అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.