రాజమౌళి వారసుడి రెండవ ప్రయత్నం ఫెయిల్

Sri SImha's second attempt failed

Sri SImha's second attempt failed

ఎస్ఎస్ రాజమౌళి కుటుంబం నుండి వచ్చిన నటుడు శ్రీసింహ. కీరవాణి కుమారుడు. మొదటి సినిమా ‘మత్తువదలరా’తో మంచి హిట్ అందుకున్నాడు. ఫస్ట్ సినిమాతోనే డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడని అందరూ అనుకున్నారు. రాజమౌళి సైతం శ్రీసింహకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఫస్ట్ ఫిలిం రిలీజ్ టైంలో అయితే ప్రభాస్ ద్వారా ప్రమోషన్లు చేయించారట. సినిమా మీద హైప్ తీసుకొచ్చారు. అది బాగా పనిచేసింది. సినిమా హిట్ అయింది. మంచి వసూళ్లను తెచ్చింది.

రెండవ సినిమా ‘తెల్లవారితే గురువారం’ విషయంలో కూడ అదే చేయాలని అనుకున్నారు. దీనికి కూడ దర్శకుడు కొత్త కుర్రాడే. ఆనుకున్నట్టే ప్రీరిలీజ్ వేడుకకు రాజమౌళి ఎన్టీఆర్ ను తీసుకొచ్చారు. సినిమా మీద హైప్ పెంచారు. అప్పటివరకు అలాంటి సినిమా ఒకటి ఉందని కూడ తెలియని వారికి తారక్ పుణ్యమా అని సినిమా గురించి తెలిసింది. అలా జనం దృష్టిలో అయితే సినిమా పడగలిగింది కానీ బాక్సాఫీస్ ముందు మాత్రం బోల్తాకొట్టింది. నిన్న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలను అంతగా అందుకోలేకపోయింది. కనీసం యావరేజ్ టాక్ కూడ తెచ్చుకోలేదు. దీంతో ఫ్లాప్ రిజల్ట్ తప్పేలా లేదు.