Sri Reddy: షణ్ముఖ్ – దీప్తి సునైనా బ్రేక్ అప్ పై స్పందించిన శ్రీ రెడ్డి.. పెళ్లయి ఉంటే ఇలా చేస్తావా.. అంటూ కామెంట్స్!

Sri Reddy: సాధారణంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరు కొన్ని రోజులపాటు చర్చలు జరుపుకున్న ఆ సీజన్ పూర్తి అయిన తరువాత ఆ విషయం గురించి మాట్లాడుకోవడం మానేస్తారు. కానీ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ పూర్తి అయినప్పటికీ ఈ కార్యక్రమం గురించి ప్రతి రోజు సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. అలా వినిపించడానికి గల కారణంసిరి, షణ్ముఖ్ జస్వంత్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న వీరిద్దరి ఎంతో చనువుగా ఉండటం వల్ల షణ్ముఖ్ జస్వంత్ లవర్ దీప్తి సునయన చెప్పడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడంతో వీరి విషయంపై ఎంతో మంది స్పందిస్తున్నారు.

ఈ క్రమంలోనే సంచలనాత్మక నటి శ్రీరెడ్డి బ్రేకప్ విషయంపై స్పందించి తనదైన శైలిలో కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ బ్రేక్ అప్ అవ్వడానికి బిగ్ బాస్ పరోక్షంగా కారణమని తెలిపారు. ఎంతో అందమైన జంట ఇలా విడిపోవడం తనకు చాలా బాధగా ఉందని శ్రీరెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇకపోతే దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ తో బ్రేకప్ చెప్పుకోవడానికి బిగ్ బాస్ కారణం అయితే..గతంలో దీప్తి సునయన కూడా బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి ఇతర కంటెస్టెంట్ ల తో ఎంతో చనువుగా ఉందనే విషయాన్ని ఈమె బయటపెట్టారు.

గత ఐదు సంవత్సరాల నుంచి రిలేషన్ లో ఉన్న మీరు ఎన్నో ఎత్తుపల్లాలను చూసి ఉంటారు అలా ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకోవాలి కానీ ఇలా బ్రేక్ అప్ చెప్పుకోవడం సరైనది కాదు. ఒకవేళ షణ్ముఖ్ జస్వంత్ తో పెళ్లి కనుక జరిగే ఉంటే ఇలాగే తనని వదిలేస్తావా అంటూ శ్రీరెడ్డి దీప్తి సునయనను ప్రశ్నించారు. షణ్ముఖ్ జస్వంత్ పై ఉన్న ప్రేమకు గుర్తుగా వీరిద్దరూ కలిసి టాటూలు వేయించుకున్నారు ఇలా వేయించుకున్న వాళ్లు అందరూ విడిపోతూనే ఉన్నారు. మనం ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెంది ముందుకు దూసుకుపోతున్న మనం భారతీయులం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి వీరి బ్రేకప్ విషయంపై స్పందించారు.