Anasuya: సారీ..మేం మా పాత్రల్లో బిజీగా మారిపోయాం.. అనసూయ?

Anasuya: తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై జబర్దస్త్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు వెండితెరపై సినిమాలలో మంచి మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఒకవైపు కెరీర్ పరంగా దూసుకుపోతూ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది. అయితే అనసూయ వెండితెరపై మాత్రం తన అందాల ప్రదర్శనకు నో అని చెబుతోంది.

సినిమాలలో కూడా మంచి మంచి పాత్రలు ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పటివరకు గ్లామరస్ లుక్ లో కనిపించిన అనసూయ పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్రలో నటించి అందరినీ ఒక్క సారిగా అవాక్కయ్యేలా చేసింది. ఇందులో ఆమె మాట్లాడే మాట తీరు, కట్టుబొట్టు అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి.

ఇక తాజాగా అనసూయ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా ఒక నెటిజన్ అల్లుఅర్జున్ తో దిగిన సెల్ఫీ ని పంపమని అడిగగా.. ఆ విషయంపై స్పందించిన అనసూయ.. పుష్ప సినిమా సెట్ లో సెల్ఫీ దిగుదాం అనే ఆలోచన రాలేదండీ.. సారి.. మీ మా పాత్రల్లో బిజీగా మారిపోయాం.. ఈసారి రెండో పార్ట్ షూటింగ్ చేసినప్పుడు కచ్చితంగా సెల్ఫీ తీసుకోవడానికి ట్రై చేస్తాను అని అనసూయ చెప్పుకొచ్చింది. పుష్ప సినిమా పార్ట్ 1 లో అసూయ తక్కువగా ఉన్నప్పటికీ, ఇక సెకండ్ పార్ట్ లో అనసూయ పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండబోతోందని తెలుస్తోంది.