మనీ ల్యాండరింగ్ కేసులో హాజరుకానున్న సోనియాగాంధీ.. అంతలోనే కోవిడ్!

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ కూడా నేషనల్ హెరాల్డ్ పత్రిక కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. దీంతో ఈడీ అధికారులు వీరిని ఈ నెల 8 న దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలి అని నోటీసులు పంపారు. కానీ అంతలోనే సోనియా గాంధీ కరోనా వైరస్ బారిన పడ్డారు.

జ్వరం తో పాటు కొన్ని కోవిడ్ లక్షణాలతో బాధ పడుతూ ఉండగా ప్రస్తుతం ఆమె ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక ఈమెకు వైద్య సహాయం కూడా అందుతుంది. దీంతో ఈడీ అధికారులు 8న చేపట్టాల్సిన దర్యాప్తును వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.