ఢిల్లీలో గంగారామ్ ఆస్పత్రిలో చేరిన సోనియా.. ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం!

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ కూడా నేషనల్ హెరాల్డ్ పత్రిక కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. దీంతో ఈడీ అధికారులు వీరిని ఈ నెల 8 న దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలి అని నోటీసులు పంపారు. కానీ అంతలోనే సోనియా గాంధీ కరోనా వైరస్ బారిన పడ్డారు.

జ్వరం తో పాటు కొన్ని కోవిడ్ లక్షణాలతో బాధ పడుతూ ఉండగా ప్రస్తుతం ఆమె ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక ఈమెకు వైద్య సహాయం కూడా అందుతుంది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఇక ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది అని తెలిసింది. వైద్యులు తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు అని తెలిసింది.