మహేష్ తో విజయ్ పోటీపై ఇండస్ట్రీ నుంచే క్లారిటీ.!

నిన్నటి నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండల తాజా చిత్రాలు “సర్కారు వారి పాట” మరియు “లైగర్” చిత్రాలు ఒకే తేదీలో పోటీ పడుతున్నాయని ఓ టాక్ వైరల్ అవ్వడం మొదలయ్యింది. ఏప్రిల్ 1నే ఈ రెండు సినిమాలు వస్తాయని నడుస్తున్న ఈ టాక్ కి ఇప్పుడు ఇండస్ట్రీ నుంచే ఒక క్లారిటీ వచ్చింది.

ఈ రెండు సినిమాలుపై నడుస్తున్న ప్రచారంపై ఎలాంటి నిజం లేదని రెండు సినిమాలు కూడా వేరు వేరుగా రిలీజ్ అవుతాయని కన్ఫర్మ్ చేశారు. ఇది కూడా టాలీవుడ్ సినిమాలకి పి ఆర్ ఓ గా వర్క్ చేసే ప్రముఖ కంపెనీ జి ఎస్ కె మీడియా వారు కన్ఫర్మ్ చేశారు. సో ఈ గాసిప్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. ఇక మహేష్ సినిమాని దర్శకుడు పరశురామ్ పెట్ల తీస్తుండగా విజయ్ సినిమాని పూరి జగన్నాథ్ భారీ లెవెల్లో తీస్తున్నారు.