హీరోతో డీల్ కుదుర్చుకున్న రకుల్‌.. అదేంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయం..!

పంజాబీ సోయ‌గం ర‌కుల్ ఎంత‌టి నేర్పరి అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వేరే రాష్ట్రం నుండి వ‌చ్చి మ‌న రాష్ట్రంలో పాగా వేసిన ఈ అమ్మ‌డు ఒక‌వైపు సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌డ‌మే కాక బిజినెస్‌ల‌తోను హోరెత్తిస్తుంది.మ‌రోవైపు త‌న త‌మ్ముడిని కూడా హీరోగా ప‌రిచ‌యం చేసింది. ర‌కుల్ స్పీడ్ చూస్తుంటే రానున్న రోజుల‌లో ఈ అమ్మ‌డు హ‌వా మాములుగా ఉండ‌ద‌ని చెప్పాలి. ఇటీవ‌ల క‌రోనా నుండి కోలుకున్న ర‌కుల్ ప్ర‌స్తుతం త‌ను క‌మిట్ అయిన సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉంది. చేతిలో దాదాపు అర‌డ‌జ‌నుకి పైగా ప్రాజెక్టులు ఉండ‌గా, ప్ర‌స్తుతం త‌మిళ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది.

తాజాగా తమిళంలో `అయలాన్` షూటింగ్‌ను కంప్లీట్ చేసింది ర‌కుల్ . ఈ సంద‌ర్భంగా ప్రముఖ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించింది. హీరో శివ‌కార్తికేయ‌న్‌తో షూటింగ్ చాలా బాగా ఎంజాయ్ చేశా. త‌మిళంలో ఎలా సంభాషించాలో చెప్పారు. నాకు ఇష్ట‌మైన ఫుడ్ చెన్నైలో ఎక్క‌డ దొరుకుతుందో చెప్పేవారు. ఇక మేమిద్ద‌రం షూటింగ్ స‌మ‌యంలో ఓ డీల్ కూడా కుదుర్చుకున్నాం. సెట్‌లో ఉన్న‌ప్పుడు నేను ఆయ‌న‌తో ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. ఆయ‌న నాతో త‌మిళంలో మాట్లాడాలి అని ర‌కుల్ చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం త‌మిళంలోను బాగానే ఆఫర్స్ వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ అమ్మడు త‌మిళం నేర్చుకోవాల‌నే క‌సితో ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది.

ఈ మ‌ధ్య వైష్ణ‌వ్ తేజ్‌తో క‌లిసి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా షూటింగ్ పూర్తి చేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్ చెక్ అనే చిత్రంలోను న‌టిస్తుంది. ఇందులో నితిన్ హీరోగా న‌టిస్తున్నాడు. ఇక హిందీలో మే డే అనే చిత్రంలో న‌టిస్తుంది. ఇందులో అమితాబ్ బ‌చ్చ‌న్‌, అజ‌య్ దేవ్‌గ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స‌త్యాగ్రహ చిత్రంలో క‌లిసి న‌టించిన అజ‌య్‌-బిగ్ బీ మ‌ళ్లీ ఏడేళ్ల త‌ర్వాత ఈ మూవీలో క‌లిసి న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని అజ‌య్ దేవ్ గ‌న్ డైరెక్ట్ చేస్తుండ‌టం విశేషం. ఈ ప్రాజెక్టులో అజ‌య్ పైల‌ట్ గా క‌నిపించ‌నున్నాడు.మ‌రోవైపు బాలీవుడ్ స్టార్లు అజ‌య్ దేవ్ గ‌న్, సిద్దార్థ్ మ‌ల్హోత్రాతో క‌లిసి రూపొందుతున్న సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ చిత్రానికి థ్యాంక్ గాడ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు .