Siddharth : సిద్ధార్థ్ సెన్సేషనల్ పోస్ట్ ఏపీ మినిస్టర్స్ పైనేనా?ఇంతకీ ఏముందంటే!

Siddharth : ఒకప్పుడు టాలీవుడ్ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సిద్ధార్థ్ కూడా ఒకడు. తన సినిమాలతో యూత్ లో ఒక ఊపు తెచ్చిన సిద్ధార్థ్ తర్వాత తర్వాత అలా ఫేడ్ అవుట్ అయ్యిపోయాడు. అయితే ఇక మళ్ళీ చాలా కాలం బ్రేక్ తీసుకొని మళ్ళీ రీఎంట్రీ మహా సముద్రంతో ఇచ్చాడు కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. అయితే సిద్ధార్థ్ కి తెలుగు సినిమా పట్ల కానీ ఆడియెన్స్ పట్ల కానీ ఉన్న మమకారం మాత్రం ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాడు.

అలానే ఏ విషయాన్ని అయినా కూడా ఎలాంటి వారు ఉన్నా కూడా ధైర్యంగా దాన్ని చెప్పగలడు. అలాగే గత కొన్ని రోజులు నుంచి ఏపీలో జరుగుతున్న టికెట్ ధరల సమస్యపై తాను కూడా స్పందించాడు. ఇక ఇప్పుడు అయితే ఏపీ మంత్రులనే టార్గెట్ చేస్తూ పెట్టిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఎక్కడా కూడా ఏపీ సమస్య కోసమే మాట్లాడుతున్నా అని చెప్పలేదు కానీ ప్రస్తుతం అయితే టికెట్ ధరల అంశం భారతదేశ వ్యాప్తంగా ఒక్క ఏపీ లోనే నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

అందుకే ఏపీ అని చెప్పకుండా ఎవరైతే మినిష్టర్ లు టికెట్ ధరలు తగ్గించేసి కస్టమర్స్ కి డిస్కౌంట్ ఇస్తున్నారో వారు అంతా కూడా మా టాక్సులతో ఇప్పుడు లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మా టాక్సులు మా డబ్బులని అవినీతి రూపంలో కాజేసి అనుభవిస్తున్నారు. మరి మీరంతా మీరు లగ్జరీ లను తగ్గించుకొని మాకు డిస్కౌంట్ ఇవ్వొచ్చు కదా అని అడుగుతున్నాడు. దీనితో ఈ సంచలన ట్వీట్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.