Sid Sriram: రెమ్యూనరేషన్ పెంచేసిన సిద్ శ్రీరామ్.. ఎంతో తెలిస్తే షాక్..!

Sid Sriram: ఇప్పుడు ఉన్న సింగర్స్ లో సిద్ శ్రీరామ్ ప్రథమస్థానంలో ఉన్నాడని చెప్పడంలో సందేహం లేదు.సిద్దు శ్రీరామ్ తన గాత్రంతో ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తను పాడిన ప్రతి పాట సూపర్ హిట్ అయ్యింది. ఆయన పాడిన పాటలు ఎంతో వినసొంపుగా అందరి హృదయాల్ని ఆకట్టుకొనేలా ఉండడంతో సిద్ శ్రీరామ్ ని అభిమానించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. శ్రీరామ్ పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అవటంతో తన రెమ్యూనరేషన్ పెంచినట్టు సినీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి.

శ్రీ రామ్ పాడిన పాటలు అన్ని సూపర్ హిట్ అవ్వడం వల్ల అతి తక్కువ కాలంలో స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రతి ఒక్క సినిమాలోనూ కనీసం ఒక పాట అయినా శ్రీరామ్ తో పాడించాలని దర్శక నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. తన గాత్రంతో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన శ్రీ రామ్ కి ఇండస్ట్రీలో డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఈయన పాడిన ప్రతి పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవ్వాల్సిందే. ఇండస్ట్రీలో తన పాటకి డిమాండ్ పెరగటంతో శ్రీరామ్ తన రెమ్యూనరేషన్ పెంచాడని సమాచారం.

సిద్ శ్రీరామ్ గత సంవత్సరం వరకు ఒక్కొక్క పాట మూడు లేదా నాలుగు లక్షల రూపాయల పారితోషికం తీసుకునే వాడు. కానీ ఈ సంవత్సరం ఈయన తన రెమ్యూనరేషన్ పెంచడనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం శ్రీరామ్ ఒక్క పాటకు 7 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న యంగ్ సింగర్స్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సింగర్ గా సిద్ శ్రీరామ్ పేరు వినిపిస్తోంది. ఇటీవల సర్కారు వారి పాట సినిమా నుండి విడుదలైన “కళావతి” అనే పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. అతి తక్కువ సమయంలో
మిలియన్ న్యూస్ రాబట్టుకుంది. శ్రీ రామ్ పాడిన ప్రతి పాట ప్రేక్షకాదరణ పొందడంతో ప్రొడ్యూజర్లు ఎంత డబ్బు ఖర్చు చేయడానికైన వెనకాడటం లేదు.