ప్రభాస్ గురించి హ్యాపీ మూమెంట్స్ తెలియ చేసిన శృతిహాసన్!

బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన నటించిన రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకులను సందడి చేయ లేకపోయినప్పటికీ ప్రభాస్ తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ మొదటిసారిగా నటిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ గురించి శృతిహాసన్ ఎంతో గొప్పగా తనతో స్వీట్ మూమెంట్స్ గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సాధారణంగా ప్రభాస్ ఏదైనా సినిమా షూటింగ్ లో ఉన్నారు అంటే తప్పకుండా లొకేషన్ లో ఉన్నవారందరికీ సరిపడా భోజనాన్ని ఇంటి నుంచి తీసుకురావడం ఆయనకు అలవాటు. ప్రభాస్ భోజనం తెచ్చారు అంటే ఎన్నో రకాల ఆహార పదార్ధాలు ఉంటాయని ఆయన అందరికీ సరిపడా భోజనాన్ని తీసుకు వస్తారని ఇదివరకే పలువురు ఎన్నోసార్లు వెల్లడించారు.

ఈ క్రమంలోనే సలార్ టీమ్ కోసం ప్రభాస్ ఇంటి నుంచి భోజనం తీసుకు వచ్చారు. అయితే ప్రభాస్ తెచ్చిన భోజనాన్ని శృతిహాసన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ప్రభాస్ తో ఉన్నటువంటి స్వీట్ మూమెంట్స్ గురించి తెలియజేశారు. ప్రస్తుతం శృతిహాసన్ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక శృతి హాసన్ మొట్టమొదటిసారిగా ప్రభాస్ సరసన పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు.ఇక ఈమె తెలుగులో బాలకృష్ణ చిరంజీవి వంటి హీరోల సరసన కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.