Shriya Saran: మనం సినిమా షూటింగ్ సమయంలో విషాదం..గుండె ముక్కలైంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రియ..!

Shriya Saran: శ్రియ శరణ్ గత రెండు దశాబ్దాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్.దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం ఎన్నో సినిమాలలో కీలక పాత్రలో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఇదిలా ఉండగా తాజాగా శ్రియ నటించిన గమనం సినిమా డిసెంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విషయాలను శ్రీయ ఈ సందర్భంగా వెల్లడించారు.

సంజనా రావు దర్శకత్వంలో క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్న గమనం సినిమాలో శ్రీయ శరణ్ ,నిత్యమీనన్, ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దర్శకురాలు ఈ సినిమా కథ వినిపించగానే ఎంతో ఎమోషనల్ అయ్యానని వెంటనే ఈ సినిమాకు ఒప్పుకున్నానని ఈమె తెలిపారు.ఇందులో తను ఒక దివ్యాంగురాలుగా కనిపించబోతున్నానని మాటలు మాట్లాడటం రాకపోయినా తనకు వినిపిస్తాయని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక విషాద ఘటన చోటు చేసుకుందని. షూటింగ్ జరిగే సమయంలో తన స్నేహితుడు మరణించారన్న వార్త వినగానే తన గుండె ముక్కలైందని, అయినా ఆ బాధను దిగమింగుకుని సినిమాల్లో నటించానని ఈ సందర్భంగా శ్రేయ ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విషాద ఘటనను తెలియజేశారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇందులో ప్రతి పాత్ర ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉందని ఈమె తెలిపారు.