Godavari Fame Neetu Chandra : ‘గోదావరి’ మరదలి పిల్ల నీతూ చంద్ర గురించి తెలిస్తే షాకవుతారు.!

Godavari Fame Neetu Chandra

Godavari Fame Neetu Chandra :  సుమంత్ హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘గోదావరి’‌ సినిమాలో సుమంత్ మరదలు ‘రాజీ’ పాత్రలో మెరిసిన ముద్దుగుమ్మ నీతూ చంద్ర. పల్లెటూరి అమ్మాయిగా, చాలా సాఫ్ట్ అండ్ కూల్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ కరాటేలో బ్లాక్ బెల్ట్ అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.

తెలుగులో చాలా తక్కువ సినిమాల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ తమిళ, హిందీ తదితర భాషలతో పాటు, కొన్ని భోజపురి సినిమాల్లో కూడా నటించింది. కానీ, తనకు కరాటే, తైక్వాండో వంటి పోరాట విద్యలంటే ఎంతో ఇష్టమనీ చెప్పుకొచ్చింది.

ఇష్టం అంటే, ఏదో టైమ్ పాస్ కోసం కాదు, ఆ పోరాట విద్యల్లో చాలా చాలా గొప్ప ప్రావీణ్యం వుందట. బోలెడన్ని అవార్డులూ, రివార్డులూ కూడా అందుకుందట. నీతూ చంద్ర. 1997 వ సంవత్సరంలో తైక్వాండఓ టైటిల్ కోసం భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిందట నీతూ చంద్ర. అలాగే కమర్షియల్ యాడ్స్‌లో నటించడం, మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడమన్నా తనకెంతో ఇష్టమంటోంది నీతూ చంద్ర.

తెలుగు తెరపై కనిపించకపోయినా, కెరీర్ పరంగా నీతూ చంద్ర చాలా చాలా బిజీగా గడపుతున్నానని చెబుతోంది. అవకాశం వస్తే తెలుగు తెరపై సందడి చేయడానికి తానెప్పుడూ రెడీనే అంటోంది. అలాగే సోషల్ మీడియాలోనూ అమ్మడు హైపర్ యాక్టివ్. హాట్ హాట్ ఫోటో సెషన్స్‌తో నెటిజన్లను అలరిస్తూ వుంటుంది అందాల నీతూ చంద్ర.