Shanthi Swaroop: చనిపోయేటప్పుడు ఆదిని తలుచుకొని చనిపోతా..అంటూ ఎమోషనల్ అయినా శాంతి స్వరూప్!

Shanthi Swaroop: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాల ద్వారా ఎంతో మంది కమెడియన్స్ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు. అయితే వారికి ఎన్నో కన్నీటి గాథలు ఉన్న వేదికపై ప్రతి ఒక్కరిని ఎంతో నవ్విస్తూ సందడి చేస్తూ ఉండేవారు.ఇకపోతే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ కార్యక్రమంలోని కంటెస్టెంట్ లకు అవార్డులను ప్రధానం చేశారు. ఈ అవార్డులలో భాగంగా శాంతి స్వరూప్ కూడా అవార్డును అందుకొని ఈ వేదికపై తన కన్నీటి గాదని బయటపెట్టారు.

ఈ సందర్భంగా శాంతి స్వరూప్ మాట్లాడుతూ ఒకానొక సమయంలో నా దగ్గర డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారని కేవలం పది రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలుగా భావించేవాడిని తెలిపారు.ఆ పది రూపాయలతో అరటి పండ్లు తిని ఆకలి నింపుకున్న రోజులు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా శాంతిస్వరూప్ తన కష్టాలను తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు.తన నాన్న చనిపోతే తన అంత్యక్రియలు కూడా నా దగ్గర డబ్బులు లేక రెండు వేలు అప్పు చేసి అంత్యక్రియలు చేశానని గుర్తు చేసుకున్నారు.

ఇప్పుడు ఈ వేదికపై ఇలా అందరి ముందు ఉన్నాను,నా నాలుగు వేళ్ళు నా నోట్లోకి వెళుతున్నాయి అంటే అందుకు గల కారణం హైపర్ ఆది. అతను చేసిన సహాయాన్నినేను ఎప్పటికీ మర్చిపోననీ, నేను చనిపోయే ముందు ఆది పేరున తలుచుకొని చనిపోతా అంటూ శాంతి స్వరూప్ ఎమోషనల్ అవడంతో అక్కడున్న కొందరు కంట తడిపెట్టుకున్నారు. ఇలా ఈ వేదికపై శాంతిస్వరూప్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.