రూ.కోట్ల ఆస్తి కోసమే నరేష్ ను రమ్య బ్లాక్ మెయిల్ చేస్తోందా.. ఆస్తి ఎన్ని రూ.కోట్లంటే?

సీనియర్ నరేష్, రమ్య రఘుపతి ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకోగా వేర్వేరు కారణాల వల్ల నరేష్ ముగ్గురితో విడిపోయిన సంగతి తెలిసిందే. నరేష్ ఆస్తి రియల్ ఎస్టేట్ బూమ్ వల్ల విపరీతంగా పెరిగిందని ఆయన ఆస్తి 1000 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండవచ్చని సమాచారం. ఆ ఆస్తుల కోసమే రమ్య రఘుపతి నరేష్ ను బ్లాక్ మెయిల్ చేస్తోందని తెలుస్తోంది.

ఈ రీజన్ వల్లే రమ్య రఘుపతి నరేష్ కు విడాకులు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. రమ్య రఘుపతి విడాకులు ఇవ్వనని చెబుతున్న నేపథ్యంలో నరేష్ రమ్య రఘుపతికి అధికారికంగా విడాకులు రావాలంటే మాత్రం చాలా సమయం పట్టే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. నరేష్, పవిత్ర లోకేశ్ వివాహం ఇప్పట్లో జరిగే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది.

మరోవైపు సుచేంద్ర ప్రసాద్ పవిత్ర లోకేశ్ గురించి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పవిత్ర లోకేశ్ కాపురాలు కూల్చే వ్యక్తి అని ఆమె డబ్బు కోసమే నరేష్ పంచన చేరిందని ఆయన కామెంట్లు చేశారు. నెటిజన్లు మాత్రం నరేష్ దే తప్పు అని అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. పవిత్ర లోకేశ్ ను కూడా నెటిజన్లు ఈ విషయంలో తప్పుపడుతున్నారు. వివాహ వ్యవస్థపై వీళ్లకు గౌరవం లేదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పవిత్ర లోకేశ్, నరేష్, రమ్య రఘుపతి సమస్యను పరిష్కరించుకోకపోతే ఈ సమస్య మరింత పెద్దదయ్యే ఛాన్స్ ఉంది. సినిమాలతో బిజీగా ఉన్న నరేష్, పవిత్ర లోకేశ్ ఈ తరహా వార్తల ద్వారా వార్తల్లో నిలుస్తారని ఫ్యాన్స్ సైతం ఊహించలేదు. నరేష్, పవిత్ర లోకేశ్ కెరీర్ పై దృష్టి పెడితే బాగుంటుందని అనవసర వివాదాలకు ఛాన్స్ ఇవ్వవద్దని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.