అలనాటి ప్రముఖ నటి లక్ష్మి కూతురు.. ఐశ్వర్య శేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా 200కు పైగా సినిమాలలో నటించి తమకంటూ మంచి గుర్తింపు లభించింది. ఆకాశమంత సినిమాలో త్రిష కి తల్లిగా ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండి పోయింది. కొంత కాలం క్రితం ఈమె సమంత ప్రధానపాత్రలో నటించిన ఓ బేబీ సినిమా లో నాగ శౌర్య తల్లిగా నటించింది. ఈమె సినిమాలలోనే కాకుండ బుల్లితెర మీద ప్రసారమైన పలు సీరియల్స్ లో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులకి కూడా బాగా దగ్గరయ్యింది.
ఇటీవల ఒక తమిళ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఐశ్వర్య శేఖర్ తన పర్సనల్ విషయాలను గురించి కూడా చెప్పుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీలో అనేది ఒక రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో అందరి జీవితాలు ఎప్పుడూ ఒకేవిధంగా ఉండవు. కొన్ని సందర్భాలలో కొందరి జీవితాలు తలకిందులవుతాయి. అలా ఒకప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ మంచి పొజీషన్ లో నటి ఐశ్వర్య పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. చేతిలో అవకాశాలు లేక డబ్బు సంపాదించటం కోసం వీధుల్లో తిరుగుతూ సబ్బులు అమ్ముతోంది.
ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఐశ్వర్య మాట్లాడుతూ…తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల డబ్బు సంపాదించడం కోసం యూట్యూబ్ ఛానల్ నడుపుతూ.. వీధుల్లో సబ్బులు అమ్ముకుంటూ బ్రతుకుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.సినిమా ఇండస్ట్రీలో అందరి పరిస్థితి నయనతార లా ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు సంపాదించడం కోసం పాచి పనులు చేయటానికి కూడా వెనుకాడను. జీతం ఇస్తానంటే మీ ఆఫీస్ లో పని చేసేందుకు కూడా సిద్ధం. హీరోయిన్గా అందరికి సెకండ్ ఇన్నింగ్స్ నయనతారలా ఉండదు. ప్రస్తుతం అప్పులన్నీ తీర్చి స్వతంత్రంగా జీవిస్తున్నాను. అప్పుడు నేను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అంటే ఒక మెగా సీరియల్ ఆఫర్ నాకు రావాలి అంటూ చెప్పుకొచ్చింది.
