Yashoda Movie: యశోద సినిమాతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వనున్న సీనియర్ నటి మధురిమ…!

Yashoda Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి సమంత ప్రస్తుతం యశోద సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న సమంత ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడం కోసం చైల్డ్ ఆర్టిస్ట్,సీనియర్ నటి మధురిమను చిత్ర బృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో నటించడానికి నటి మధురిమ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇకపోతే మధురిమ “సిరివెన్నెల” చిత్రం ద్వారా బాలనటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.

ఇలా బాలనటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం 420 ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె భరత నాట్య కళాకారిణిగా కూడా ఎన్నో అవార్డులను ప్రశంసలను అందుకున్నారు. దేశవిదేశాలలో ఎన్నో స్టేజ్ ప్రదర్శనలు చేసిన మధురిమ నృత్య దర్శకురాలిగా కూడా పని చేశారు. ఈ విధంగా నాట్యకారిణిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె సమంత నటిస్తున్న యశోద సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.ఇలా ఒకప్పుడు నాట్యమయూరిగా తన నాట్యంతో అందరినీ మెప్పించిన ఈ హీరోయిన్ చాలా కాలం తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.”ఒరేరు రిక్షా” సినిమాలో నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా అనే పాట ద్వారా నటి మధురిమ ప్రతి ఒక్కరికి సుపరిచితమయ్యారు.