Sekhar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అదే విధంగా పలు కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ శేఖర్ మాస్టర్ బిజీగా గడుపుతున్నారు. ఇక ఈయన ఢీ డాన్స్ షో కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే గత సీజన్ లో జాను లిరి విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే శేఖర్ మాస్టర్ కారణంగానే ఈమె విన్నర్ గా నిలిచారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
వీరిద్దరి మధ్య సంథింగ్ రిలేషన్ ఉందని అందుకే శేఖర్ మాస్టర్ తనని విన్నర్ ను చేశాడు అంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ ఆరోపణలపై శేఖర్ మాస్టర్ ఘాటుగా స్పందించారు.ఆ అమ్మాయి బాగా చేసింది అందుకే మెచ్చుకున్నాను. బాగా చేసిన అబ్బాయిలను కూడా పొగిడాను. బాగా చేసిన వాళ్లని అభినందించడం తప్పా. నేనేదో కావాలని గెలిపించారని కామెంట్స్ చేస్తున్నారు. నా సోషల్ మీడియా పోస్టుల కింద ఆమె పేరుతో కామెంట్స్ చేయటం వల్ల నేను చాలా సఫర్ అయ్యాను అని తెలిపారు.
నాకు ఆమెకి రిలేషన్ ఉందని, ఇంకా ఏదేదో అంటూ చాలా చెత్తగా మాట్లాడారు. మా మధ్య ఏదో ఉందని మాట్లాడితే వాళ్ల, మా ఫ్యామిలీలు ఎంత బాదపడతారు. ఇలా కామెంట్స్ చేస్తే అసలు ఏమొస్తుంది అంటూ మాట్లాడారు. ఇక ఇండస్ట్రీలో ఏ కొరియోగ్రాఫర్ కి రాని అదృష్టం నాకు వచ్చిందని తెలిపారు. తాను రామ్ చరణ్, చిరంజీవి సర్ ఇద్దరికీ కూడా కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని అందుకున్నానని ఇది అదృష్టంగా భావిస్తానని శేఖర్ మాస్టర్ తెలిపారు.చిరంజీవి సర్ – చరణ్ సర్ లతో పనిచేసే ఛాన్స్ రావడమే గొప్ప అవకాశం. అలాంటిది ఇద్దర్ని కలిపి డ్యాన్స్ చేయించే అవకాశం నాకు రెండు సార్లు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఖైదీ సినిమాలో అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్, ఆచార్య సినిమాలో బంజారా సాంగ్ రెండు నేనే కంపోజ్ చేశాను. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ కి నాకు బాగా పేరొచ్చింది అని తెలిపారు.