బోయిగూడ ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

సికింద్రాబాద్‌‌లోని బోయిగూడలో జరిగిన ఆగ్ని ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిపిందే. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో.. 11 మంది విగతజీవులయ్యారు. ఈ మహా విషాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ… 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. కార్మికుల మృతదేహాలు స్వస్థలాలకు వెళ్లేలా చూడాలని సీఎస్‌ను ఆదేశించారు. మృతి చెందిన వారంతా బీహార్‌ చెందిన కూలీలు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్వాప్తు జరుపుతున్నారు. ఫైర్‌ సెఫ్టీ ప్రికాషన్స్ తీసుకోని కారణంగానే ప్రమాదం జరిగిందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.