Sarkaru Vaari Paata : సినిమాలో కంటెంట్ వుంటే ఆడుతుంది.. లేకపోతే ఫ్లాప్ అవుతుంది. సినిమా ఫలితానికీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ ఏంటి సంబంధం.?
సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వాలు చేయాల్సిన సాయం, సినిమా టిక్కెట్ల ధరల పెంపు వంటి వ్యవహారాలపై టాలీవుడ్ పెద్దలు మొన్నామధ్య ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి నేతృత్వం వహించారు. పరిశ్రమలో ఒకరిద్దరు చిరంజీవి పెద్దరికాన్ని ప్రశ్నిస్తున్నా, పరిశ్రమ అంతా చిరంజీవినే పెద్దన్నగా భావిస్తోందన్నది నిర్వివాదాంశం.
అలా చిరంజీవి వెంట, జగన్ని కలిసేందుకు వెళ్ళినవారిలో ప్రభాస్, మహేష్ తదితరులున్నారు. ఆ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా ఫ్లాప్ అయ్యింది. చిరంజీవి నటించిన ‘ఆచార్య’ కూడా డిజాస్టర్ అయ్యింది. తాజాగా ‘సర్కారు వారి పాట’ సినిమా మీద కూడా నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
ఈ మూడు సినిమాల ఫలితాలకీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముడిపెడుతున్నారు కొందరు నెటిజన్లు. ఇదెక్కడి వింత.? అని జనం విస్తుపోతున్నారు. పరిశ్రమ ప్రముఖులు కోరినట్లే, ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరల్ని పెంచింది.. తమ విధానమైన సినీ అభిమానులకు తక్కువ ధరతో వినోదం అందుబాటులో వుండాలన్న ఆలోచనని